వనపర్తి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతామని తెలిపారు. పాలమూరు ప్రజల మీద సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి మా ట్లాడారు.
తెలంగాణ సాధనకు పాలమూరు ఓట్లే ఇంధనమన్నారు. మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. ప్రతిపక్షాలు కేసులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించాయని ఆరోపించారు. అవరోధాలను అధిగమించి ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటనకు పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఈ సభతో అర్థమైందన్నారు. విపక్ష నేతలు కొందరు వీధుల్లో మొరుగుతూ కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.