మద్దూర్, ఫిబ్రవరి 6 : ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పాలమూరు జిల్లా పేరును దిగజారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు రేవంత్రెడ్డి సభలు ఏర్పాటుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలుచేయని సీఎం రేవంత్, ఏ ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఓటర్లు మేల్కొని కాంగ్రెస్ బుద్ధిచెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.