Palamuru | మహబూబ్నగర్ అర్బన్ : ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్నగర్ను అద్భుతంగా తీర్చిదిద్ధడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
ఫ్రెంచ్ మోటర్ సైక్లిస్ట్ ఆలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ వేదిక ద్వారా ఫ్రాన్స్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, థాయిలాండ్కు చెందిన 8 మంది విదేశీ బైక్రైడర్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న యాత్రను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం వారితోపాటు బైక్ రైడింగ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక అవకాశాలు అందిస్తూ అసాధారణమైన మోటర్ సైక్లింగ్ అనుభవాలను కల్పించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఫ్రీడబ్ల్యూ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదన్నారు. మహిళలు, పురుషులు అనే వివక్ష లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. రైడర్లు అలిసన్ గ్రున్, సడ్రైన్, ఆస్లీ, జనెల్లి, జువేనా, స్టాసి, లారీ, సిగ్రిడ్, రచన బైక్ రైడింగ్ ద్వారా మహబూబ్నగర్, వికారాబాద్, నిర్మల్, వరంగల్, పోచంపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఎనిమిది మంది బైక్రైడర్లు 9 రోజులపాటు బతుకమ్మ సంబరాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శించడంతోపాటు కళాకారులు, చేనేత కార్మికులను కలుస్తారన్నారు. ఈ పర్యటనకు హైదరాబాద్కు చెందిన మోవో సంస్థ ఫౌండర్ జైభారతి మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు.
ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్… నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తుంది. సమానత్వానికి సాక్షిగా ఫ్రెంచ్ మోటార్ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ (Free W) అనే వేదిక ద్వారా తెలంగాణలో… ఫ్రాన్స్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్… pic.twitter.com/iI5t4OMyEA
— V Srinivas Goud (@VSrinivasGoud) October 14, 2023