హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ దేశంలో వేగవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిదానం సమీపంలో సీఎం కేసీఆర్, బోయినపల్లి వినోద్కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అందేలా ఆశీర్వదించాలని అయ్యప్పస్వామిని కోరుకుంటూ అర్చనలు చేశారు. దేశ ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలోనూ శబరిమలలో మొట్టమొదటిసారిగా తెలంగాణ జెండాను ఎగురవేసినట్లు జీఎస్ ఆనంద్ గురుస్వామి తెలిపారు.
కేసీఆర్ ఫ్లెక్సీలు కట్టాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సహచరులకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మనోహర్, రాజు, మహేశ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.