యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట( Yadagirigutta)లో కొండపైకి ఆటోలను అనుమతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించడంతో ఆటో కార్మికులు( Auto workers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ప్రకటనతో మంగళవారం స్థానిక వైకుంఠ ద్వారం ముందు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు.
ఆటో కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అలాగే . అలాగే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆటోరిక్షాలకు ఫిట్ నెస్, సర్టిఫికెట్ చార్జీలను మాఫీ చేస్తాం అని కేసీఆర్ ప్రకటించడంపై కూడా ఆటో కార్మికులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.