హైదరాబాద్, నవంబర్16 (నమస్తే తెలంగాణ): గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకొన్నది. గాంధీ పుట్టిన గడ్డపై నుంచి గాంధేయ మార్గంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. చేనేతపై విధించిన జీఎస్టీను తొలగించాలని చేనేత విభాగం నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బుధవారం అనేక నిర్బంధాల మధ్య సూరత్ గాంధీ పారులో ధర్నాకు దిగారు. జీరో జీఎస్టీ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినదించారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, నటి, సామాజిక కార్యకర్త పూనమ్కౌర్, చెలమళ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.