మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి ఆమె 1300కుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్లో బీఆర్ఎస్కు 4,279 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీకి 2917 ఓట్లు, బీజేపీకి 998 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిపై 1362 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.