Telangana Assembly Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ 2864 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్కు 3732, కాంగ్రెస్ 2868, బీజేపీ 2160 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.