హైదరాబాద్ : తెలంగాణలో కరోనా లాక్డౌన్ విధించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి..