హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఏఏ సన్నాలకు బోనస్ వర్తిస్తుందనే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు 33 సన్న రకం ధాన్యాన్ని గుర్తించింది. ఇవే కాకుండా నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి మిగిలిన రకాలను కూడా సన్నాలుగానే పరిగణిస్తామని పేర్కొంది.
కెర్నల్ ఎల్/బీ రేషియో ప్రకారం సన్నాలను గుర్తించనుంది. గింజ పొడవు 6 మి.మీ , వెడల్పు 2 మి. మీ కన్నా తక్కువగా, ఎల్/బీ రేషియో 2.5 కన్నా ఎక్కువగా ఉంటే సన్నాలుగా గుర్తిస్తామని స్పష్టం చేసింది.
సిద్ది(WGL44), కంపాసాగర్ వరి-1(KPS2874), సాంబ మసూరి (BPT 5204), జగిత్యాల వరి-3 (JGL27356), జగిత్యాల వరి-2 (JGL28545), వరంగల్ సాంబ (WGL 14), వరంగల్ సన్నాలు (WGL 32100), జగిత్యాల్ మసూరి (JGL 11470), పొలాస ప్రభ (JGL 384), కృష్ణ (RNR 2458), మానేరు సోనా (JGL 3828), తెలంగాణ సోనా (RNR 15048), వరంగల్ వరి-1119, కునారం వరి-2 (KNM 1638), వరంగల్ వరి-2 (WGL 962), రాజేంద్రనగర్ వరి-4 (RNR 21278), కునారం వరి-1 (KNM 733), జగిత్యాల సన్నాలు (JGL 1798), జగిత్యాల సాంబ (JGL 3844), కరీంనగర్ సాంబ (JGL 3855), అంజన (JGL 11118), నెల్లూరు మసూరి (NLR 34 449), ప్రత్యుమ్న (JGL 17004), సుగంధ సాంబ (RNR 2465), శోభిని (RNR 2354), సోమనాథ్ (WGL 34 7), ఆర్ఎన్ఆర్ 31479 (PRC), కేపీఎస్ 6251 (PRC), జేజీఎల్ 33124 (PRC), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (MTU 1224), మారుటేరు మసూరి (MTU 1262), ఎంటీయూ 1271.