హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో ఏకంగా 2,32,200 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,516 కాగా, మిగిలిన 2,26,684 కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపా రు. ఈ కేసులను పరిష్కరించడం వల్ల లబ్ధిదారులకు పరిహారంగా సుమారు రూ.80 కోట్లు చెల్లించినట్టు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి, హైకోర్టు న్యాయ సేవాధికా ర కమిటీ కార్యదర్శి స్వావి వరూధిని తెలియజేశారు.
హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ పీ నవీన్రావు, హైకోర్టు న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్కుమార్ షావిలి పర్యవేక్షణలో జిల్లా కోర్టుల్లో లోక్ అదాలత్లు కొనసాగాయి. న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమా ర్, జస్టిస్ సాంబశివరావునాయుడు నేతృత్వంలో లోక్ అదాలత్ కోర్టులు కక్షిదారుల అభీష్టం మేరకు వివిధ రకాల కేసులను పరిషరించాయి.