హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ సరికొత్త రికార్డు సాధించింది. ఐదో మంగళవారం ఏకంగా 10,025 మంది మహిళలు వైద్యసేవలు పొందారు. గత వారం 9,806 మంది పరీక్షలు చేయించుకొన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్స్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.