హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారత్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొందరు వ్యక్తులు సిలిండర్లను బావిలో పడేసి.. పక్కనే ఉన్న కట్టెల మూటను నెత్తిన పెట్టుకొని వెళ్లే వీడియోను ఓ నెటిజన్ ఆదివా రం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారతదేశ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం. సిలిండర్ను పారేసి.. కట్టెలను తీసుకెళ్లండి. మోదీజీకి ఇష్టమైన అచ్ఛేదిన్ వాలా గుడ్ డే బిస్కెట్ తీసుకోండి అని ఆ వీడియోకు కామెంట్ రాశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ వీడియోతోపాటు రీట్వీట్ చేశారు.