హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. వీరిలో అత్యధికులు ఉస్మానియా యూనివర్సిటీలోనే చేరారు. వీరిలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్టాల విద్యార్థులున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మొత్తం 22,050 పీజీ సీట్లు భర్తీ అయ్యాయి. ఇతర రాష్ర్టాల విద్యార్థులను మన రాష్ర్టానికి రప్పించేందుకు అధికారులు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా (ఎన్ఐక్యూ) సీట్లను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. దీంతో ఈ కోటా సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.