హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అన్ని మెడికల్ కాలేజీల్లో జూన్ 26న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశించింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందిని, వీలైతే వారి కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించింది. యోగాతో కలిగే లాభాలను విద్యార్థులకు వివరించాలని కోరింది.