హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పంటలకు పర్యావరణహిత ఎరువులే మేలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం యూఏఎల్, మునారా ఆగ్రో టెక్నాలజీస్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన సేంద్రియ వ్యవసాయ సంబంధిత బయో సొల్యూషన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం తగ్గి, పంట ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.