తిరుమలగిరి : వర్గపోరుకు మారుపేరైనా కాంగ్రెస్(Congress)లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని సూర్యాపేట(Suryapeta) జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(MP Venkatreddy), కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి కలిసి మంగళవారం దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడొకరు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ(Flexies)లను దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేశారు. అయితే తమకు తెలియకుండా, తమ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు కొన్ని ఫ్లెక్సీలను చించేశారు. దీంతో శిబిరం వద్ద కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆ పార్టీ నాయకుల సూచనతో సమస్య సద్దుమణిగింది.