హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సాయుధ బలగాలను తక్షణమే వెనకి రపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడం లేదని తెలిపారు. కాబట్టి మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.