హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అక్టోబర్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు. పదోతరగతిలో 35.69%, ఇంటర్మీడియట్లో 53.37% మంది పాసయ్యారు. ఫలితాలకు www.telanganaopenschool.org వెబ్సైట్ను సంప్రదించాలని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. మార్కుల మెమోలను 15 రోజుల్లో విద్యాసంస్థలకు పంపిస్తామని చెప్పారు. 7 నుంచి 16 వరకు రీ వెరిఫికేషన్ కమ్ రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.