వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
కొల్లాపూర్, జూన్ 6: వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో నిర్మించిన విద్యుత్తు సబ్స్టేషన్లను ఆదివారం నాగర్కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ శర్మన్తో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు.