హైదరాబాద్, జూలై 13 (నమసే ్తతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవని, లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలను రైతులకు తెలియజేసి, రైతులు క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఇక్రిశాట్లో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగ ఉన్నతాధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు.