హైదరాబాద్: పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొనుగోళ్లు చేయరా అని ప్రశ్నించారు. మార్కెట్కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలు ఎక్కడన్నారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి దళారుల రాజ్యం తెస్తారా అని నిలదీశారు. బడే భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం చేస్తుండగా, ఛోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో పత్తికి మద్దతు ధరకు మించి రూ.8,257 ఇస్తున్నారని, మరి తెలంగాణలో రేతుకు చెల్లిస్తున్నది కేవలం రూ.5 వేలేనా అని ప్రశ్నించారు. రెండేండ్ల క్రితం పత్తి ధర రూ.10 నుంచి రూ.15 వేలు పలికిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అనర్థం ఏమిటని ఎక్స్ వేదిగా ఫైర్ అయ్యారు.
‘బడా భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం. ఛోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు. గుజరాత్ లో మద్దతు ధరకు మించి రూ.8,257 రేటు. మరి తెలంగాణలో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలేనా?. మార్కెట్ కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ?. ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా?. రెండేళ్ల క్రితం పత్తికి 10 నుంచి 15 వేల ధర. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏమిటీ అనర్థం?. నిన్న పెట్టుబడి సాయం అందించలేదు.. నేడు కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా..? పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం. ముందుచూపు లేని ముఖ్యమంత్రి వల్లే ఈ అన్యాయం.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
బడా భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం. ఛోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు
గుజరాత్ లో మద్దతు ధరకు మించి రూ.8,257 రేటు. మరి తెలంగాణలో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలేనా ?
మార్కెట్ కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ ? ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా ?… pic.twitter.com/lJYzjz1A1o
— KTR (@KTRBRS) October 15, 2024