Minister Vemula Prashanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజులో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తవుతున్నది కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఒకే రోజు స్లాట్ బుకింగ్, అదే రోజు టెస్టింగ్తో పాటు లైసెన్స్ కూడా పొందుతున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో డ్రైవింగ్ లైసెన్స్ల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు కానీ.. సీఎం కేసీఆర్ దయ వల్లనే కమ్మర్పల్లి వాసుల ఎన్నో ఏండ్ల కల సాకారమైందని అన్నారు. కమ్మర్పల్లిలో కవితమ్మ సహకారంతో రూ.3 కోట్ల నిధులు వెచ్చించి స్టేడియం నిర్మించుకున్నామని తెలిపారు. యువత కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్లు అందజేస్తున్నామని తెలిపారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. యువత కోసండ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు హెల్మెట్ గిఫ్ట్గా ఇవ్వాలని మహిళలకు సూచించారు. ఒక్క కమ్మర్పల్లి గ్రామంలోనే పెన్షన్ల కోసం రూ.112 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గడిచిన పదేండ్లలో కమ్మర్పల్లి అభివృద్ధి కోసం రూ.440 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో బంగారు పాలన జరుగుతోందని.. ఇది కొనసాగాలంటే బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.