యాదగిరిగుట్ట, ఏప్రిల్ 21: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఆన్లైన్ సేవలు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొండపైన పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్డ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో ఆన్లైన్ వ్యవస్థ అమలును నిరుడు ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్కు అప్పగించారు. తాజాగా హైదరాబాద్లోని ఈసీఐఎల్ కంపెనీలో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఈసీఐఎల్ కంపెనీ సీఎండీ అనురాగ్కుమార్, ఆలయ ఈవో ఎన్ గీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా స్వామివారి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలయ అధికారులు, సిబ్బందికి ఆన్లైన్ సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించారు. కొండపైన సుమారు 8 నుంచి 10 కౌంటర్లు ఏర్పాటు చేసే వీలున్నది.