నిజామాబాద్ : జిల్లాలోని ఎస్సారెస్పీ నుంచి దిగువ గోదావరిలోకి 22,720 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ఉధృతి పెరగడంతో 20 వరద గేట్లను ఎత్తి 74,880 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశామని పేర్కొన్నారు.
సాయంత్రానికి ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 5 గంటలకు 14 గేట్లను మూసివేసి 6 గేట్లతో 18,720 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 4 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కాలువకు మధ్యాహ్నం నీటి విడుదలను 3500 క్యూసెక్కులకు పెంచినట్లు తెలిపారు.
సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదలను ప్రారంభించామన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1090.90 అడుగుల( 89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 292.116 టీఎంసీల వరద వచ్చిందన్నారు. కాలువలు, గోదావరిలోకి 220 టీఎంసీల మిగుల జలాలను వదిలినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లేనా..?