జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు(Medigadda barrage) వరద ప్రవాహం (Ongoing flood )కొనసాగుతున్నది. 16.17టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్కు ఆదివారం ఇన్ఫ్లో 41,200 క్యూసెక్కులు కాగా, 8 బ్లాక్లలోని 85గేట్లు ఎత్తి అంతేమొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం 89.50 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. రివర్బెడ్ నుంచి 1.50 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం అధికారులు చెబుతున్నారు.