మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుందిప. స్థానికుల కథనం మేరకు.. వస్త్రం తండా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఏపీలోని రాజమండ్రికి చెందిన చందన నాగేశ్వరరావు (40)అక్కడికక్కడే మృతి చెందగా.. రాజు, శేషు అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.