పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్లో ఉంటున్న పదలపర్తి పవన్కుమార్(42), భార్య సరస్వతి, కుమారుడు శ్రీకేతన్, అత్త వరలక్ష్మితో కలిసి వ్యాగనార్ కారులో ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు.
పెద్దఅంబర్పేట మొదటి బ్రిడ్జి వద్దకు రాగానే ముందు ఎటువంటి ఇండికేటర్ లేకుండా రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. కారు నడుపుతున్న పవన్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
కారులోని మిగతా ముగ్గురు గాయపడగా.. స్థానిక దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి, ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు.