హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆటోను లారీ(Lorry) ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాల(Sonala) వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.