కేసముద్రం, మార్చి 20: బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఓ రైతు తన బావిలో నీరు అడుగంటడంతో పంటలకు నీరందించాలని క్రేన్ సహాయంతో బావిలో పూడిక తీయిస్తున్నాడు. పూడిక తీయడానికి అదే గ్రామానికి చెం దిన బానోత్ రమేశ్ (42) కూలికి వచ్చా డు. బావిలో ఉన్న విద్యుత్తు మోటర్ ఆన్ కాకపోవడంతో రమేశ్ మోటర్ను మరమ్మత్తు చేస్తుండగా కరెంటు షాక్కు గురై మృతి చెందాడు.