కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి(Bike accident) ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సిర్పూర్(టి) మండలం వెంపల్లి(Vempalli) రైల్వే గేటు వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను దవాఖానలో చేర్పించి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.