సిద్దిపేట : సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు కల్వర్టు(Culvert)ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం వద్ద కరీంనగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు జగిత్యాలకు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.