కరీంనగర్ కార్పొరేషన్, జూలై 12 : ‘సర్’లో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఓటర్ల సందేహాలను తీర్చేందుకు, ఓటరు నమోదు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కిసాన్నగర్, చింతకుంటలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను ప్రారంభించారు. నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని, జూలై 24లోగా మిగిలిన ప్రక్రియను ముగించాల్సి ఉన్నదని గంగుల చెప్పారు. సర్వర్లు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే బీఆర్ఎస్ రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్లైన్లో దరఖాస్తులను పూర్తి చేసేందు కు ఉచిత సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.