నీలగిరి, డిసెంబర్ 12: తెలంగాణలో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ ఆక్సిజన్ అందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక్క రోజే లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్కిృష్ణారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఎస్ఎల్బీసీలో, రైల్వే ట్రాక్, లోయర్ రైల్వే ఫ్లైఓవర్, రైల్వే గెస్ట్హౌజ్ వద్ద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఆరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి, ఆయా శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.