హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్తోనే బీసీలు, ఎంబీసీల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న లక్ష ఆర్థిక సాయం కుల, చేతివృత్తుల అభ్యున్నతికి ఎంతో దోహదపడనున్నదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. ఆ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో బీసీ, ఎంబీసీ, సంచారజాతులు లేవని తెలిపారు. లక్ష సాయం పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.