హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఎస్ఐసీ ‘వన్ డిస్ట్రిక్ వన్ ఎగ్జిబిషన్’ పేరిట చేపట్టే ఈ ప్రదర్శనలో వ్యవసాయం, నీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ వంటి అంశాల్లో ఔత్సాహికులు రూపొందించిన ఆవిష్కరణలు ఉంటాయని వివరించారు.