సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఇస్నాపూర్ వద్ద ఆగిఉన్న బస్సును ఓ ఢీకొట్టింది. దీంతో ఒక్కరు దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గోవా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.