వికారాబాద్: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడప్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుడిని వికారాబాద్కు చెందిన తరుణ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోఘటనలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద పడకల్ చౌరస్తాలో బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.