హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు.
ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానతో పాటు 300 పడకల కొత్త అంకాలజీ బ్లాకు నిర్మించగా, ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ అంకాలజీ బ్లాకుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ మంత్రి హరీశ్రావు నెటిజన్లతో సంతోషం పంచుకున్నారు.