Onam Sepecial Trains | ఓనమ్ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్ – కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25న సికింద్రాబాద్ (07199) నుంచి రైలు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది.
27న కొల్లం నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.50 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, చిత్తాపూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈ-రోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అల్వే, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగానస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్లికర, కాయంకులం స్టేషన్లు రెండు మార్గాల్లో రైళ్లు ఆగనున్నాయి.
అలాగే 27న సికింద్రాబాద్ – కొల్లామ్ (07121), 29న కొల్లామ్ – సికింద్రాబాద్ (07122) మార్గాల్లో నడువనున్నాయి. అలాగే 28న కాచిగూడ – కొల్లామ్ (07044), 30న కొల్లామ్ – కాచిగూడ (07045) మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇదిలా ఉండగా.. ఓనమ్ పండుగ ఈ నెల 20న మొదలు కాగా.. ఈ నెల 31న ముగియనున్నది.
SCR to run two Onam special trains between Kacheguda-Kollam @drmsecunderabad @drmgtl pic.twitter.com/1oIl763C9C
— South Central Railway (@SCRailwayIndia) August 24, 2023
SCR to run two Onam special between Secunderabad-Kollam (via Guntur) @drmsecunderabad @drmgnt @drmvijayawada pic.twitter.com/RI82OCILlW
— South Central Railway (@SCRailwayIndia) August 24, 2023