హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై గవర్నర్ తమిళిసై ప్రశంసల జల్లును కురిపించారు.శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో విద్యుత్ శాఖను పొగడ్తలతో ముంచెత్తారు. నాడు కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణ నేడు వెలుగు-జిలుగులతో విరాజిల్లుతుందని అన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్ తో రైతాంగానికి భరోసా కలిగిందని, వ్యవసాయ రంగంలో నూతనాధ్యయం మొదలైందని పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించే నాటికి స్థాపిత సామర్ధ్యం 7,778 మేఘావాట్లు ఉండగా తెలంగాణా ఏర్పడ్డాక ఆ సామర్ధ్యం 18,453 మేఘావాట్లకు చేర్చిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు.2,126 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగంపెరిగిందని కొనియాడారు.
విద్యుత్ సమస్యతో కుదేలైపోయిన తెలంగాణా నేడు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా అవతరించిందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా తెలంగాణా రైతాంగానికి భరోసాను పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతికి విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు ప్రభాలమైన సూచికలని గవర్నర్ వెల్లడించారు.