హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శనలో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. ప్రజాస్వామ్య భావన పరిఢవిల్లుతున్నదనే కోణంలో దీనిని రూపొందించారు.
ఈసారి తెలంగాణ శకటానికి అవకాశం లేకపోయినప్పటికీ, తాను మాట్లాడిన తరువాత అవకాశం ఇచ్చారని సీఎం గత ఢిల్లీ పర్యటన తరువాత చెప్పారు. అయితే, తెలంగాణ శకటంతోపాటు వినిపించిన గీతంలో నెహ్రూ పేరు రాకపోవడంతో తెలంగాణవాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గాంధీ, పటేల్, సుభాష్ చంద్రబోసులు.. రాంజీ గోండు, కుమ్రం భీం, వీరనారి ఐలమ్మలు అంటూ సాగిన గీతంలో నెహ్రూను స్మరించుకోలేదు. నెహ్రూ పేరును మరిచిపోయారా.. లేక కావాలని చేర్చలేదా అని చర్చనీయాంశం అయ్యింది.