తొర్రూరు, మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రానున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో ఏర్పాట్లపై ఆదివారం మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. హెలిప్యాడ్, బహిరంగసభ, పారింగ్ స్థలాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో తొర్రూరు మిషన్ భగీరథ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. కేటీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సభ, జన సమీకరణపై చర్చించారు. 8న తొలుత తొర్రూరు పట్టణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 20 వేల మంది మహిళలతో నిర్వహించే బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు పావలావడ్డీ, అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు.