హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి ఈడిగి నరేశ్గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వారు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.