హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితను స్థితప్రజ్ఞ కలిసి పాత పెన్షన్ అమలుపై సమగ్ర సమాచారంతో కూడిన సంపుటిని అందజేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పునరుద్ధరించిన రాష్ట్రాల్లో అమలు తీరుతెన్నులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లపై సవివరంగా కవిత అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రాలకు ఎన్పీఎస్ ట్రస్ట్ నుంచి రావాల్సిన పెన్షన్ నిధిని ఏవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ అడ్డుకుంటుందో ఇరువురు చర్చించారు. సీపీఎస్ విధానం వల్ల రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాల సామాజిక భద్రత షేర్ మారెట్ పాలవుతుందని యూనియన్ నాయకులు కవితతో చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ రూ.2వేల కోట్లు మారెట్ పాలు కాకుండా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కవితను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, రాష్ట్ర నాయకులు నటరాజ్ చరక, హాజీ పాల్గొన్నారు.