హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ పాత పెన్షన్ను అమలు చేస్తామన్న పార్టీకే అక్కడి ఓటర్లు మద్దతు పలికారని తెలిపింది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే రుజువైందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటి భూపతిరావు పేర్కొన్నారు. ఈ హామీని నిలబెట్టుకొని ఉద్యోగుల విశ్వాసం పొందాలని వారు కోరారు.