హైదరాబాద్, జూలై 15 (నమస్తే తె లంగాణ): తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ఆదివారం ప్రారంభమవుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు.
గద్వాల జిల్లా ఆలంపూర్లో మొదలై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, రెవెన్యూ కేంద్రాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. జూలై 31న యాదాద్రి నరసింహస్వామి క్షేత్రంలో ముగుస్తుందని శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.