భారీగా పెరిగిన గెలల ధర
అశ్వారావుపేట, మే 1: పామాయిల్ గెలల ధర అందించటంలో ఆయిల్ఫెడ్ సంస్థ మరో ఆల్టైం రికార్ట్ సృష్టించింది. ఆయిల్ఫెడ్ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయిల్పాం గెలల ధర పెరుగుతూనే ఉంది. మే నెల ధరతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలతో పోల్చితే మేలో టన్ను గెలల ధర ఏకంగా రూ.1,020 పెంచి రూ.18,384 ప్రకటించింది.
ఈ ఏడాది జనవరిలో టన్ను గెలల ధర రూ.14,416 ఉండగా ఫిబ్రవరిలో రూ.15,147, మార్చిలో రూ.15,923, ఏప్రిల్లో రూ.17,264కు చేరింది. రూ.20 వేలకు చేరువలో గెలల ధర చెల్లిస్తున్న టీఎస్ ఆయిల్ఫెడ్, ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఙతలు తెలుపుతున్నారు. పెరిగిన ధర మే నెలకు రైతులు ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే అందిస్తామని టీఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్ టీ సుధాకర్రెడ్డిలు తెలిపారు.