తాడ్వాయి, ఫిబ్రవరి 28 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అధికారులతో కలిసి తల్లుల సన్నిధితో పాటు నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, కలెక్టర్, ఎస్పీ పాదరక్షలను విడిచి భక్తిభావంతో పర్యటించగా ఇతర శాఖల అధికారులు చెప్పులు, షూ విడవకుండా గద్దెల పరిసరాలను కలియతిరిగారు. చెప్పులు, షూ వేసుకొని తల్లుల సన్నిధికి వచ్చిన వారిపై చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
మేడారంలో నూతనంగా నిర్మించిన రాతి కట్టడాలు విరిగిపోయిన విషయం తెలిసిందే. శనివారం మేడారం పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సమ్మక్క గద్దె ప్రాంతంలో విరిగి పడిన శిలలు, కడీల ప్రదేశాన్ని పరిశీలించారు. మేడారం మహా జాతరకు కోట్లాది రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం నాణ్యతగా పనులు చేపట్టకపోవడంతో ‘తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు’ అనే శిర్షీకను ఫిబ్రవరి 4న ‘నమస్తేతెలంగాణ’లో వార్త ప్రచురితమైంది. జాతర సమయంలో భక్తులు కొబ్బరి, బెల్లం విసిరివేయడంతో పాటు భక్తుల తాకిడికి వెదురు బొంగు రాతి కట్టడాలతో పా టు మరికొన్ని రాతి కట్టడాలు విరిగిపోయాయి. మంత్రులు పరిశీలించి రాతి కట్టడాల స్థానంలో నూతన శిలలను ఏర్పాటు, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు.