CPGET | హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిరోజు మూడు సెషన్లలో జరిగే ఈ పరీక్షలు ఓయూ ఆధ్వర్యంలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్ , మహిళా వర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర సంప్రదాయ పీజీ కోర్సుల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.